मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 164, कुल 167 में से
संदर्भ में पढ़ें158 ముకుందమాల
బిందెలో వేసి “వీ రీ కార్యము చేసిరని ఈ బిందెలో చేతి నుంచు” డని రాజ చెప్పగా మంత్రులట్లు చేయలేదు. “వీ రట్లు చేసియుండరని మీరు చేయియుంచు” డని వా రడుగగా కులశేఖరులు చేయివేసి పాము నెత్తి “మీరిట్లు చేయు” డనగా వారు పరుగెత్తిపోయిరి. కులశేఖరులు ఆ దుష్టులకు దండన విధించి, వైష్ణవులను విడిపించి “ఏ భాగవతులను భగవంతునికంటె హెచ్చుగ పూజించుచున్నానో, అట్టివారియందు దోషము కల్పించిరి. ఇక వీరితో సహవాసము కూడదని నిశ్చయించి తన పుత్తుఁ డగు దృఢవ్రతునకు రాజ్యమొసగి ముఖ్యులగు కొందఱు స్వాములతో శ్రీరంగమునకు పోయి శ్రీరంగనాథుని సేవించి, శ్రీరంగనాథుని యందు అతిభక్తిగలదియు, నీళాదేవియొక్క అంశజురాలును అగు తన కొమార్తెను ఉదధారాపూర్వకముగ శ్రీరంగనాథునకు సమర్పించి తనకు గల సంపదను వరదక్షిణగ నిచ్చెను. కులశేఖరు లిట్లు కొంతకాలము శ్రీరంగమున సుఖముగ నుండి పిమ్మట తిరుమల, కాంచి మొదలగు కొన్ని దివ్యదేశములకు పోయి ఆళ్వారు తిరునగరికి, పిమ్మట మన్నారు కోవెలకు పోయి శ్రీరాజగోపాల స్వామిని సేవించి తన అరువది యేడవ యేట అచటనే పరమపదము నొందిరి. కులశేఖరులు ముకుందమాల యొనర్చి భక్తిలేని వారికి భక్తి గలిగిం చిరి. భక్తిరసము గల ‘పెరుమాళ్ తిరుమొళి’ని రచించిరి. దానికి పెరియవాచ్ఛాంబిళ్ల వ్యాఖ్యానము వ్రాసిరి. శ్రీకులశేఖ రాళ్వార్ తిరువడిగళే శరణమ్.