मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 163, कुल 167 में से
संदर्भ में पढ़ें[Header] ముకుందమాల 157
నము చెందిరి. నేను ఆ రావణుని చంపదలచి యుంటిని. మా స్వామియే సంహరించిరట. అతడు సుఖముగ నున్నాడని తెలిసినదని తాను సుఖముగ నుండెను. కులశేఖరులు సదా తిరుప్పావును అనుసంధానము చేయుచుండిరి. కులశేఖరులు ముం దవతరించిరి. ఆండాళమ్మ వెనుక అవతరించిరి. ఇది అసంభవము కాదా యనిన నెంత మాత్రము కాదు. శ్రీభూనీళాదేవులు నిత్యురాండ్రు. నిత్యురాలైన భూమియే ఆండాళుగ నవతరించిరి. వారిచేత రచింపబడిన ప్రబంధములును నిత్యమే. ఆమె తిరుప్పావును ఈ అవ తారముననే చేసెనని తలంపరాదు. పూర్వమే యేర్పడియున్నది. అందుచే కులశేఖరులు తిరుప్పావు ననుసంధించుట అసంభవముగాదు. రాజునకు వైష్ణవస్వాములయందు ద్వేషము పుట్టించవలెనని మంత్రు లాలోచించిరి. ఇట్లుండగా శ్రీరామనవమి యుత్సవము వచ్చెను. స్వామి కభిషేకము చేయునపుడు సకలాభరణములను తీసియించిరి. మరల నలం కరించునపుడు ఒక ముత్యాలహారము కనబడలేదు. భటులు కావలియుండి నను ఆ యాభరణ మెటులో పోయెను. ఈ సంగతి తెలిసిన పిమ్మటనే స్వామికి పూజ జరుగవలెనని రాజు ఆజ్ఞాపించెను. ఇదే సమయమని హార మును దాచియుంచిన వారిలో ముఖ్యమంత్రి ముందుకు వచ్చి “ప్రభూ! ఆ హారమును దొంగిలించినది మీకు పరమహితులయి యుండిన యీ శ్రీవైష్ణవులే అని ఖైది చేసి యుంచిన స్వాములను జూపెను. కులశేఖరులు పరమభాగవతోత్తములైన ఆ స్వాములను జూచి “నేను నమ్మను. పరమైకాంతులగు వీరితోడ బహుకాలముగ మెలగుచున్నాను. ఈ మాటను మీరెట్లనగలిగితిరి?” అనెను. ఇంత వైష్ణవపక్షపాతముండబట్టియే యింత యనర్థము తటస్థించెనని మంత్రు లనిరి. “పేదవా రిందు రారు. వీ రీ కార్యము చేయరు. నే నొక యేర్పాటు చేసెదను” అని పలికి బుసకొట్టుచుండు నొక పామును దెచ్చి యొక